బాదేసిన కేరళ.. 53 బంతుల్లో 150 పరుగులు!
ABN , First Publish Date - 2021-03-01T10:07:13+05:30 IST
విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతం చోటుచేసుకుంది. కేవలం 53 బంతుల్లోనే 149 పరుగులు చేజ్ చేసిన కేరళ మ్యాచ్ సొంతం చేసుకుంది. ఆదివారం నాడు బిహార్ జట్టుతో జరిగిన ఈ వన్డే మ్యాచులో కేరళ ఓపెనర్ రాబిన్ ఊతప్ప విజృంభించాడు.
తిరువనంతపురం: విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతం చోటుచేసుకుంది. కేవలం 53 బంతుల్లోనే 149 పరుగులు చేజ్ చేసిన కేరళ మ్యాచ్ సొంతం చేసుకుంది. ఆదివారం నాడు బిహార్ జట్టుతో జరిగిన ఈ వన్డే మ్యాచులో కేరళ ఓపెనర్ రాబిన్ ఊతప్ప విజృంభించాడు. కేవలం 32 బంతుల్లోనే 87 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఊతప్ప వీరబాదుడుతో 149 పరుగుల లక్ష్యాన్ని కేరళ జట్టు కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. తన ఇన్నింగ్సులో ఊతప్ప ఏకంగా 10 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచులో కేరళ స్పీడ్స్టర్ శ్రీశాంత్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.