shawarma తిని ఫుడ్ పాయిజన్‌తో బాలిక మృతి

ABN , First Publish Date - 2022-05-02T12:55:48+05:30 IST

ఓ పాఠశాల బాలిక షావర్మా తిని ఫుడ్ పాయిజన్‌తో మృతి చెందిన ఘటన కేరళ రాష్ట్రంలోని కన్హంగాడ్ జిల్లాలో వెలుగుచూసింది....

shawarma తిని ఫుడ్ పాయిజన్‌తో బాలిక మృతి

తిరువనంతపురం : ఓ పాఠశాల బాలిక షావర్మా తిని ఫుడ్ పాయిజన్‌తో మృతి చెందిన ఘటన కేరళ రాష్ట్రంలోని కన్హంగాడ్ జిల్లాలో వెలుగుచూసింది. కన్హంగాడ్ జిల్లాకు చెందిన 19 మంది పాఠశాల విద్యార్థులు షావర్మా తిని ఫుడ్ పాయిజనింగ్ అవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షావర్మా తిన్న 16 ఏళ్ల బాలిక ఫుడ్ పాయిజన్ కావడంతో చికిత్స పొందుతూ మరణించింది.మరో 18 మంది అస్వస్థతతో కరివల్లూర్‌కు చెందిన దేవానంద కన్హన్‌గాడ్ జిల్లా ఆసుపత్రిలో చేరారు.షావర్మా విక్రయించిన దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేసి దాన్ని సీజ్ చేశారు. 18మంది విద్యార్థులు కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.ఈ ఘటనపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు.


ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కేరళ మంత్రి ఎంవీ గోవిందన్ పరామర్శించారు.కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లలో నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని మంత్రి చెప్పారు.రెస్టారెంట్లలో అందించే ఆహారం నాణ్యమైనదిగా ఉండేలా ప్రభుత్వం కేరళ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తుందని మంత్రి వివరించారు.


Updated Date - 2022-05-02T12:55:48+05:30 IST