అమ్మాయిలూ రాహుల్‌తో జాగ్రత్త.. కేరళ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-03-31T05:08:03+05:30 IST

కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ కేవలం అమ్మాయిల కాలేజీలలోనే రాహుల్ పర్యటిస్తాడని, అక్కడి అమ్మాయిలంతా జాగ్రత్తగా ఉండాలని కేరళ ఇడుక్కి నేత జాయిసీ జార్జ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర దుమారం..

అమ్మాయిలూ రాహుల్‌తో జాగ్రత్త.. కేరళ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

కొచ్చి: కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ కేవలం అమ్మాయిల కాలేజీలలోనే రాహుల్ పర్యటిస్తాడని, అక్కడి అమ్మాయిలంతా జాగ్రత్తగా ఉండాలని కేరళ ఇడుక్కి నేత జాయిసీ జార్జ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతోంది. మంగళవారం తమ పార్టీ నేత, మంత్రి ఎంఎం మణి కోసం ర్యాలీ చేస్తున్న సందర్భంగా జార్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాముల్ గాంధీ కేవలం అమ్మాయిల కళాశాలలలోనే పర్యటిస్తాడు. వారితో విచిత్రమైన పనులు చేయిస్తాడు. అమ్మాయిలూ జాగ్రత్త రాహుల్‌కు ఇంకా పెళ్లి కాలేదు’ అంటూ జార్జ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు అక్కడే ఉన్న ఎంపీ ఎంఎం మణి పెద్దగా నవ్వారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమన్నారు. ‘ఓ ప్రజాప్రతినిధి ఈ తరహాలో ఆలోచించడం దురదృష్టకరం. అతడి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేరళలో సీపీఎం ఓడిపోతున్నామని తెలియడం వల్లే సీపీఎం నేతలు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నార’ని మండిపడ్డారు. 





Updated Date - 2021-03-31T05:08:03+05:30 IST