కేరళలో తగ్గని కరోనా ఉధృతి.. మరో 12,617 మందికి పాజిటివ్..

ABN , First Publish Date - 2021-06-23T02:28:46+05:30 IST

కేరళలో కొవిడ్-19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా మరో 12,617 పాజిటివ్ కేసులు నమోదైనట్టు...

కేరళలో తగ్గని కరోనా ఉధృతి.. మరో 12,617 మందికి పాజిటివ్..

తిరువనంతపురం: కేరళలో కొవిడ్-19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా మరో 12,617 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా మరో 141 మంది మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 28,29,510కి చేరగా.. మృతుల సంఖ్య 12,295కి చేరింది. ప్రస్తుతం కేరళలో 1,00,437 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 1,17,720 శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా.. పాజిటివిటీ రేటు 10.72గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-06-23T02:28:46+05:30 IST