బీజేపీలో చేరిన కేరళ పీపుల్స్ పార్టీ చీఫ్

ABN , First Publish Date - 2021-03-08T01:24:12+05:30 IST

రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రధాన కూటములు. ఇక ఎన్డీయే మూడవ కూటమిగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములతో పోల్చుకుంటే దాని ప్రభావం చాలా తక్కువ

బీజేపీలో చేరిన కేరళ పీపుల్స్ పార్టీ చీఫ్

తిరువనంతపురం: కేరళ పీపుల్స్ పార్టీ అధినేత, నటుడు దేవన్.. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం రాష్ట్రంలోని షంగుముఘంలో బీజేపీ నిర్వహించిన విజయయాత్రలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా మంది ప్రముఖులు బీజేపీలో చేరారు. ఈ బలంతో కేరళలో తమ ప్రభావాన్ని పెంచుకోవాలని బీజేపీ యోచిస్తోంది.


రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రధాన కూటములు. ఇక ఎన్డీయే మూడవ కూటమిగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములతో పోల్చుకుంటే దాని ప్రభావం చాలా తక్కువ. అయినప్పటికీ కేరళ రాజకీయాల్లో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు బీజేపీ సర్వ విధాలా ప్రయత్నిస్తోంది.

Updated Date - 2021-03-08T01:24:12+05:30 IST