మానవతావాది కేశవరెడ్డి
ABN , First Publish Date - 2021-11-29T06:01:10+05:30 IST
మానవతావాది కేశవరెడ్డి
కొమ్మారెడ్డి కేశవరెడ్డి స్మారక సాహితీ అవార్డు ప్రదానోత్సవ సభలో వక్తలు
గవర్నర్పేట, నవంబరు 28 : ఉపాధ్యాయులకు మార్గదర్శిగా నిలిచిన కేశవరెడ్డి మానవ విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. యూటీఎఫ్-సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం యంజీ రోడ్డులోని ఎంబీవీకే బాలోత్సవ్ భవన్లో కొమ్మారెడ్డి కేశవరెడ్డి స్మారక సాహితీ అవార్డు ప్రదానోత్సవ సభ జరిగింది. ముందుగా కేశవరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సాహితీరంగంలో విశేష సేవలందిస్తున్న రచయిత, అనువాదకులు రావెల సాంబశివరావుకు కేశవరెడ్డి స్మారక అవార్డును ప్రదానం చేశారు. సభకు అధ్యక్షత వహించిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చేందుకు పనిచేశారన్నారు. చైల్డ్ లేబర్ ప్రాజెక్టు డైరెక్టర్ డి.ఆంజనేయరెడ్డి, సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, సాహితీ ప్రస్థానం వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, శ్రీనివాసరెడ్డి, కేశవరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.