నడకుదిటి కుటుంబానికి ఎంపీ కేశినేని నాని పరామర్శ
ABN , First Publish Date - 2021-04-12T07:08:20+05:30 IST
నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన నాయకుడు మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని నివాళులర్పించారు.
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 11 : నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన నాయకుడు మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని నివాళులర్పించారు. నడకుదిటి నరసింహారావు మృతికి ఆయన సంతాపం తెలిపారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, నడకుదిటి కుటుంబ సభ్యులను ఎంపీ కేశినేని నాని ఆదివారం పరామర్శించారు. నడకుదిటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినా పార్టీలో సామాన్య కార్యకర్తగానే ఉండేవారన్నారు. మచిలీపట్నం అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమైనదన్నారు. నడకుదిటి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలపై ఉందన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి గొట్టి రామకృష్ణప్రసాద్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొడాలి శర్మ, సీపీఎం టౌన్ కార్యదర్శి సిహెచ్. రవి, టౌన్ కమిటీ సభ్యులు వి. కోటేశ్వరరావు, బి. సుబ్రహ్మణ్యం, జయరావు, మత్స్యకార సంఘం జిల్లా కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు తదితరులు కొల్లు రవీంద్రను పరామర్శించారు.