భారత్‌ను ఇలా చూస్తుంటే హృదయం ముక్కలవుతోంది: పీటర్సన్

ABN , First Publish Date - 2021-05-11T21:41:35+05:30 IST

భారత్‌లోని పరిస్థితిని తలుచుకుంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు.

భారత్‌ను ఇలా చూస్తుంటే హృదయం ముక్కలవుతోంది: పీటర్సన్

తానెంతగానో ప్రేమించే భారత్‌ను ఇలా చూస్తుంటే తన హృదయం బద్దలవుతోందని, ఈ పరిస్థితి నుంచి భారత్ త్వరగానే బయటపడుతుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-14లోని మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యహరించిన పీటర్సన్.. టోర్నీ వాయిదా పడడంతో తాజాగా స్వదేశానికి చేరుకున్నాడు. 


భారత్‌లోని పరిస్థితిని తలుచుకుంటూ హిందీలో ట్వీట్ చేశాడు. `నేను భారత్‌ను వదిలిపెట్టి వచ్చాను. కానీ, నా మనసంతా అక్కడే ఉంది. నాపై ఎంతో ప్రేమను కురిపించిన, ఆప్యాయత పంచిన దేశం గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాను` అంటూ పీటర్సన్ ట్వీట్ చేశాడు. కోవిడ్‌ సంక్షోభం నుంచి బయటపడగల సత్తా భారత్‌కు ఉందని, కరుణ, ప్రే​మ కురిపించే దేశాన్ని మహమ్మారి ఏమీ చేయలేదని పేర్కొన్నాడు. 



Updated Date - 2021-05-11T21:41:35+05:30 IST