ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ABN , First Publish Date - 2022-04-07T23:13:11+05:30 IST
పీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వైఎస్సార్ సున్నా
అమరావతి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మిల్లెట్ మిషన్ 2022-23 నుంచి 2026-27 ప్రతిపాదనను ఆమోదించారు. విద్య, వైద్య, ప్రణాళిక శాఖల్లో నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీ మంత్రులు రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ హరిచందన్కు మంత్రుల రాజీనామాలను సీఎం జగన్ పంపనున్నారు. ఈ రాత్రికే మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించనున్నారు.