తీవ్ర అసంతృప్తితో YSRCPకి కీలక నేత రాజీనామా..

ABN , First Publish Date - 2022-01-04T12:48:44+05:30 IST

వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం

తీవ్ర అసంతృప్తితో YSRCPకి కీలక నేత రాజీనామా..

  • గుండం శేషిరెడ్డి రాజీనామా
  • ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్లే..

కర్నూలు జిల్లా /బనగానపల్లె : జిల్లాలోని బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం శేషిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి ఈ విషయం తెలియజేశారు. కొంతకాలంగా అనారోగ్యం కారణంగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పినా.. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. వైసీపీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చడం లేదని విమర్శించారు.


తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. భవిష్యత్‌ కార్యాచరణ కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బనగానపల్లె నియోజకవర్గంలో పలువురు వైసీపీ నాయకులు ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో గుండం శేషిరెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపింది.

Updated Date - 2022-01-04T12:48:44+05:30 IST