సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-19T21:01:58+05:30 IST

సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా సీఎంలు నియంతలుగా మారుతున్నారని, ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్నా... ఇద్దరూ భిన్నమైనవారని గవర్నర్ అన్నారు. ఇది ప్రజాస్వాయ్యనికి మంచింది కాదని ABNతో గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.


రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శలు చేస్తారని, ఇప్పుడు గవర్నర్‌గా ఉన్నప్పుడు విమర్శిస్తున్నారని తమిళిసై అన్నారు. తనను వేరే రాష్ట్రానికి మారుస్తారనేది వాస్తవం కాదని తమిళిసై స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లిన వెంటనే తనపై అసత్య ప్రచారం చేశారని గవర్నర్‌ తమిళిసై తెలిపారు. సీఎం, గవర్నర్‌ కలిసి పనిచేయకపోతే ఎలా పాలన ఉంటుందో తెలంగాణను చూస్తే తెలుస్తుందని ABNతో గవర్నర్‌ తమిళిసై అన్నారు.

Updated Date - 2022-04-19T21:01:58+05:30 IST