మార్కెట్లోకి కీవే హైఎండ్ స్కూటర్లు
ABN , First Publish Date - 2022-05-28T06:47:32+05:30 IST
హంగేరీ కంపెనీ కీవే దేశీయ మార్కెట్లోకి రెండు హైఎండ్ స్కూటర్లను ప్రవేశపెట్టింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హంగేరీ కంపెనీ కీవే దేశీయ మార్కెట్లోకి రెండు హైఎండ్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. సిక్స్టీస్ 300ఐ, విస్టే 300 స్కూటర్లను హైదరాబాద్లో విడుదల చేసింది. ఈ స్కూటర్ల ప్రారంభ ధర రూ.2.99 లక్షలు. ఈ ఏడాది చివరి నాటికి నాలుగు విభాగాల్లో 8 ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు కీవే ఇండియా ఎండీ వికాస్ ఝబాక్ తెలిపారు.