నేషనల్ యంగ్ అచీవర్ అవార్డుకు కేజీబీవీ విద్యార్థిని ఎంపిక
ABN , First Publish Date - 2022-01-25T04:59:43+05:30 IST
కేంద్ర ప్రభుత్వం స్థానిక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని మాగర్ల లావణ్యను నేషనల్ యంగ్ అచీవర్ 2022 అవార్డుకు ఎంపిక చేసింది.
తడ, జనవరి 24 : కేంద్ర ప్రభుత్వం స్థానిక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని మాగర్ల లావణ్యను నేషనల్ యంగ్ అచీవర్ 2022 అవార్డుకు ఎంపిక చేసింది. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు ప్రకటించింది. 2018లో జిల్లాస్థాయి ఇన్స్పైయిర్ ప్రాజెక్టులో ప్రథమస్థానం సాధించిన అనంతరం అదే సంవత్సరం రాష్ట్ర అంతరిక్ష కేంద్రానికి ఎంపికై అమెరికాలోని నాసా ప్రధాన కార్యాలయానికి వెళ్లివచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆ విద్యార్థిని ప్రతిభను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపక సిబ్బంది లావణ్యను శాలువాతో సత్కరించారు.