‘మోదీ డబ్బులు’లతో వ్యక్తి జల్సా... నెక్ట్స్ దిమ్మతిరిగే సీన్!
ABN , First Publish Date - 2021-09-16T13:28:05+05:30 IST
బీహార్లోని ఖగడియా జిల్లాలో విచిత్ర ఉదంతం...
పట్నా: బీహార్లోని ఖగడియా జిల్లాలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇది తెలిసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. మానసీ పోలీస్స్టేషన్ అధికారి దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఖగడియా జిల్లాలోని భక్తియార్పూర్కు చెందిన రంజీత్ దాస్ ఖాతాలో బ్యాంకు పొరపాటు కారణంగా ఒక లక్షా 60 వేల 970 రూపాయలు జమ అయ్యాయి.
ఈ మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఖాతాలో వేశారని రంజీత్ దాస్ భావించాడు. దానిని విత్డ్రా చేసుకుని ఖర్చు పెట్టేశాడు. అయితే ఇంతలో జరిగిన పొరపాటు గుర్తించిన బ్యాంకు అధికారులు రంజీత్ను ఆ సొమ్ము తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరారు. తాను ఆ సొమ్మును ఖర్చు చేసుకున్నానని, తిరిగి ఇవ్వలేనని రంజీత్ చెప్పడంతో బ్యాంకు అధికారులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.