ఖైరతాబాద్లో ఉద్రిక్తత... బైక్కు నిప్పుపెట్టిన Congress నేతలు
ABN , First Publish Date - 2022-06-16T17:32:39+05:30 IST
నగరంలోని ఖైరతాబాద్లో కాంగ్రెస్ నేతల ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్డుపై యువజన కాంగ్రెస్ నేతలు బైక్కు నిప్పు పెట్టారు.
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్లో కాంగ్రెస్(Congress) నేతల ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్డుపై యువజన కాంగ్రెస్ నేతలు బైక్కు నిప్పు పెట్టారు. బస్సులను అడ్డుకుని నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆర్టీసీ బస్ ఎక్కి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆందోళనలతో ఖైరతాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కాగా... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఈడీ (ED) వేధింపులకు నిరసనగా ఛల్ రాజ్భవన్కు కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఖైరతాబాద్ సర్కిల్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్భవన్కు వెళ్ళకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో రాజ్భవన్ వద్ద నిరసన తెలుపుతామని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారు.