త్వరలోనే కాంగ్రెస్లో చేరుతా... నాన్న బాటలో నడుస్తా: Vijaya reddy
ABN , First Publish Date - 2022-06-18T16:38:41+05:30 IST
త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఖైరతాబాద్ కార్పొరేట్ విజయారెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్: త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఖైరతాబాద్ కార్పొరేట్ విజయారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాన్న పీజేఆర్ సీఎల్పీ లీడర్గా కాంగ్రెస్ పార్టీలో ఉండి..పార్టీలోనే మరణించారన్నారు. మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిశినట్లు చెప్పారు. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. ‘‘మా కుటుంబం ముందు నుండి కాంగ్రెస్లోనే ఉంది. కాంగ్రెస్తోనే బాగుంటుంది..అందరితో చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ నెల 23న కాంగ్రెస్లో చేరుతున్నా. నాన్న పీజేఆర్ బాటలో నడుస్తా’’ అంటూ విజయా రెడ్డి వెల్లడించారు. అలాగే జూబ్లీహిల్స్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై విజయారెడ్డి స్పందిస్తూ...‘‘జూబ్లీహిల్స్లో బాలిక మీద జరిగిన ఘటన గురించి కూడా మాట్లాడలేకపోవడం బాధ కలిగించింది.. కాంగ్రెస్లో ఉంటే ఇలాంటి ఘటనల మీద గట్టిగా మాట్లాడగలం’’ అని పేర్కొన్నారు.