Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్

ABN , First Publish Date - 2022-09-01T03:35:10+05:30 IST

కిషన్ రెడ్డి, తానూ ఖైరతాబాద్ గణేషుడి (Khairatabad Ganesh) భక్తుల దగ్గరికి వచ్చామని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేవకర్..

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్

హైదరాబాద్: కిషన్ రెడ్డి, తానూ ఖైరతాబాద్ గణేషుడి (Khairatabad Ganesh) భక్తుల దగ్గరికి వచ్చామని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేవకర్ (Former Central Minister Prakash Javadekar) అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Central Minister Kishan Reddy)తో కలిసి ఆయన ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మట్టితో గణపతిని చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. 


కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మట్టి గణపతిని పెట్టుకోవడం గొప్ప విషయమన్నారు. ప్రపంచంలోని హిందువులందరూ సంతోషంగా పండగ చేసుకునే సంప్రదాయం ఉందని చెప్పారు. బాలగంగాధర్ తిలక్ (Balagangadhar Tilak) బ్రిటిష్ వారిపై పోరాటానికి ప్రజలని సంఘటితం చేయడానికి గణేష్ ఉత్సవాలను ప్రారంభించారన్నారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు రావడం సంతోషమని కిషన్ రెడ్డి అన్నారు. 


Updated Date - 2022-09-01T03:35:10+05:30 IST