Khairatabad maha ganapati వద్ద మొదలైన భక్తుల సందడి

ABN , First Publish Date - 2022-08-31T13:32:27+05:30 IST

ఖైరతాబాద్ మహాగణపతి వద్ద తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది. ఉదయం 9.30 గంటలకు మహాగణపయ్య తొలి పూజ అందుకోనున్నారు.

Khairatabad maha ganapati వద్ద మొదలైన భక్తుల సందడి

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad maha ganapati) వద్ద తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది. ఉదయం 9.30 గంటలకు మహాగణపయ్య తొలి పూజ అందుకోనున్నారు. తొలి పూజలో గవర్నర్ తమిలిసై సౌందర రాజన్ (Tamilisai Soundara Rajan) , మంత్రి తలసాని (Talasani srinivas yadav), ఎమ్మెల్సీ కవిత (Kavita), ఎమ్మెల్యే దానం (Danama nagender) పాల్గొననున్నారు. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా  ఖైరతాబాద్ బడా గణేష్ (Vinayaka chaviti celebrations) భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలిసారి 50 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష మండపం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మహాగణపతి దర్శనానికై భక్తుల కోసం నిర్వాహకులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-31T13:32:27+05:30 IST