ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-09-18T19:31:17+05:30 IST

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది.

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. గత 9 రోజుల్లో మహాగణపతిని  10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ పరిసరప్రాంతాలు రద్దీగా మారిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్రకు ఉత్సవ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-18T19:31:17+05:30 IST