ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయండి...

ABN , First Publish Date - 2020-09-26T11:32:00+05:30 IST

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెపుతూ ఆదివారం

ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయండి...

డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగుబండి

నేలకొండపల్లి,సెప్టెంబరు25: నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెపుతూ ఆదివారం నేలకొండపల్లిలో   ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నామని, దీన్ని విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ నాయకులు పిలుపునిచ్చారు.  ఈ మేరకు డీసీఎంఎస్‌ డైరెక్టరు, పైనంపల్లి సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ నాగుబండి శ్రీనివారావు, సీడీసీ మాజీ ఛైర్మన్‌ నెల్లూరి లీలాప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.


రెవెన్యూ వ్యవస్ధలో జరుగుతున్న అవకతవకలను సరి చేసి, రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నూతన చట్టం తెచ్చారని చెపాపరు. ఆదివారం జరుగనున్న ట్రాక్టర్ల ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2020-09-26T11:32:00+05:30 IST