ఖార్గోన్ హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర: Sharma

ABN , First Publish Date - 2022-04-14T22:22:34+05:30 IST

ఖార్గోన్ హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర: Sharma

ఖార్గోన్ హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర: Sharma

ఖార్గోన్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖార్గోన్ సిటీలో హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ పేర్కొన్నారు. దీనిని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) స్పాన్సర్ చేసిందని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ  ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం శాంతియుత రాష్ట్రమని, అటువంటి రాష్ట్రంలో ఊరేగింపుపై దాడి జరిగితే అది పీఎఫ్ఐ వంటి సంస్థల ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర అని సూచిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని శర్మ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-14T22:22:34+05:30 IST