సమష్టి కృషితోనే థామస్ కప్ విజయం
ABN , First Publish Date - 2022-05-27T06:00:01+05:30 IST
సమష్టి కృషితోనే థామస్కప్ను కైవసం చేసుకోగలిగామని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ అన్నారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్
గుంటూరు(క్రీడలు), మే26: సమష్టి కృషితోనే థామస్కప్ను కైవసం చేసుకోగలిగామని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ అన్నారు. థామస్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన కిడాంబి శ్రీకాంత్, ఆయన తల్లిదండ్రులను ఆంధ్రా, గుంటూరు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ 73ఏళ్ల టోర్నమెంట్ చరిత్రలో తొలిసారిగా భారత్కు బంగారుపతకం సాధించడం గర్వంగా ఉంద న్నారు. 2024లో ఒలింపిక్స్లో మరిన్ని పతకాలు సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన ఎదుగుదలలో తల్లిదండ్రులు, సోదరుని పాత్ర మరవలేనిద న్నారు. కార్యక్రమంలో ఆంధ్రా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధక్ష్యుడు కే.పున్నయ్యచౌదరి, గుంటూరు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయపాటి రంగబాబు, కార్యదర్శి డి.శ్రీనివాసరావు, కోశాధికారి రమేష్కుమార్, టి.సంపత్కుమార్, ఎం సురేష్., ఎం.వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.