రూ. కోటి కోసం కిడ్నాప్ - కేసును ఛేదించిన పిఎం పాలెం పోలీసులు

ABN , First Publish Date - 2022-06-25T01:17:24+05:30 IST

విశాఖ: విశాఖలో ఓ కిడ్నాప్ కేసును పిఎంపాలెం పోలీసులు చేధించారు. డెవలప్‌మెంట్ పేరుతో రామకృష్ణ అనే వ్యక్తిని కిడ్నాపర్లు కిడ్నాప్ చేసి రూ. కోటి డిమాండ్ చేశారు. విషయం పోలీసులకు

రూ. కోటి కోసం కిడ్నాప్  - కేసును ఛేదించిన పిఎం పాలెం పోలీసులు

విశాఖ: విశాఖలో ఓ కిడ్నాప్ కేసును పిఎంపాలెం పోలీసులు చేధించారు. డెవలప్‌మెంట్ పేరుతో రామకృష్ణ అనే వ్యక్తిని కిడ్నాపర్లు కిడ్నాప్ చేసి రూ. కోటి డిమాండ్ చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో కిడ్నాపర్ల చెర నుంచి బాధితుడిని రక్షించారు.  

‘‘కిడ్నాప్ కేసులో రౌడీ షీటర్ హేమంత్‌తో పాటు మరో ఐదుగురు మధుసూధన్, రెహమాన్, మున్న, పవన్ కిరణ్, సుబ్బలక్ష్మీ ప్రమేయం ఉంది. వారందరిని అరెస్టు చేసి వారి నుంచి మారణాయుధాలు, ఫోన్లు, కిడ్నాప్‌కు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నాం. మొత్తం ఆరుగురిలో నలుగురు రౌడీషీటర్లు. హేమంత్‌కు డబ్బు అవసరమవ్వడంతో డెవలప్మెంట్ పేరు చెప్పి రామకృష్ణను పిలిపించాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం రామకృష్ణను ఎంబీకే గేస్ట్ హౌస్‌కు పిలిపించి కాళ్లు చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ అంటించారు. ప్రాణభయంతో రామకృష్ణ కిడ్నాపర్లకు రూ. 50 లక్షలు ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు’’ అని ద్వారకా ఏసిపి రామచంద్రమూర్తి వివరించారు. 

Updated Date - 2022-06-25T01:17:24+05:30 IST