Ap News: కడియంలో బాలిక కిడ్నాప్ కలకలం
ABN , First Publish Date - 2022-06-28T04:31:48+05:30 IST
Ap News: కడియంలో బాలిక కిడ్నాప్ కలకలం...
రాజమండ్రి: కడియంలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆటోలో ధవళేశ్వరం వరకు తీసుకువెళ్ళారు. అరిస్తే యాసిడ్ పోస్తామంటూ బాలికను కిడ్నాపర్లు బెదిరించారు. బాలికను కాపాడేందుకు ప్రయత్నించిన యువకుడిపై కిడ్నాపర్లు దాడి చేశారు. మరోవైపు కిడ్నాపర్లును వెంబడించి బాలికను స్థానికులు కాపాడారు. స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో బాలిక కిడ్నాప్కుగురైంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.