వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఇంతలో ఆమె.. అతనితో మాట్లాడటం మానేసింది.. దీంతో అతను ఎంతకు తెగించాడంటే..

ABN , First Publish Date - 2021-11-16T15:26:42+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో మరో దారుణం చోటుచేసుకుంది.

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఇంతలో ఆమె.. అతనితో మాట్లాడటం మానేసింది.. దీంతో అతను ఎంతకు తెగించాడంటే..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో మరో దారుణం చోటుచేసుకుంది. వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసివెళుతున్న ఒక యువతిపై తొలుత దాడి జరిగింది. ఆ తరువాత ఆమె గుండెలోకి మూడు తూటాలు దిగాయి. ఈ ఘటనలో అ యువతి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. యువతిపై దాడి చేసినవారు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను విచారించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. 


నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫతేగంజ్ పరిధిలోని డగ్రోలీ గ్రామానికి చెందిన హేమరాజ్ కుమార్తె ఉజాల(20)తనకు వరుసకు సోదరుడయ్యే రాజ్వీర్‌తో పాటు బైక్‌పై ఇంటికి వెళుతోంది. దారిలో రజనేష్ అనే యువకుడు కత్తి చూపించి వారి బండిని అడ్డుకుని, ఉజాలాపై దాడి చేశాడు. రాజ్వీర్ అడ్డుకోవడంతో అతనిపైన కూడా రజనీష్ దాడి చేశాడు. అనంతరం ఉజాలా గుండెపై తుపాకీ ఉంచి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆమె బాధతో విలవిలలాడిపోతూ అక్కడే కన్నుమూసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు అక్కడ హత్యకు వినియోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూశాయి. ఉజాలా, రజనేష్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం ఉజాలా కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె భయపడి రజనీష్‌తో మాట్లాడటం మానివేయడంతోపాటు అతనికి దూరంగా ఉంటోంది. దీనిని తట్టుకోలేని రజనీష్ ఆమెను అంతమొందించాలనుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.



Updated Date - 2021-11-16T15:26:42+05:30 IST