గ్రూప్‌-1లో సత్తాచాటిన కింతలి యువతి

ABN , First Publish Date - 2022-07-06T05:28:58+05:30 IST

కింతలి గ్రామానికి చెందిన యతిరాజుల భవాని గ్రూప్‌-1లో సత్తాచాటింది. తొలి ప్రయత్నంలోనే ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో ఎంపీడీవోగా ఎంపికయ్యారు. ఆమె భర్త సంపతిరావు ప్రసాదరావు విశాఖలో ఆర్‌ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.

గ్రూప్‌-1లో సత్తాచాటిన కింతలి యువతి
భవాని:

  ఎంపీడీవోగా ఎంపిక..పలువురి అభినందన

పొందూరు: కింతలి గ్రామానికి చెందిన యతిరాజుల భవాని గ్రూప్‌-1లో సత్తాచాటింది. తొలి ప్రయత్నంలోనే ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో ఎంపీడీవోగా ఎంపికయ్యారు. ఆమె భర్త సంపతిరావు ప్రసాదరావు విశాఖలో ఆర్‌ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. రైతు కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు వరహాలరావు, లక్ష్మిలకు భవాని ఎనిమిదో సంతానం. ఒకటి నుంచి పదో తరగతి వరకు  కిం తలి ప్రభుత్వపాఠశాలలో, ఇంటర్‌ శ్రీకాకుళంలో, బీటెక్‌ రాజాంలో చదివారు. 2016లో వివాహమైన భవానికి  కుమార్తె ఉన్నారు. కుటుంబ బాధ్యతలు చూసుకుంటునే గ్రూప్‌-1కు ప్రిపేరై తొలిప్రయత్నంలోనే విజయం సాధించారు. భవానికి ఐదుగురు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. ఎంపీడీవోగా ఎంపిక కావడంపై సర్పంచ్‌ పైడి ప్రసాదరావు, ఎంపీటీసీ హనుమంతురావు, గ్రామస్థులు అభినందించారు.



Updated Date - 2022-07-06T05:28:58+05:30 IST