Kiran Royal: నగరిలో రోజా శకం ముగిసింది..

ABN , First Publish Date - 2022-09-20T21:51:18+05:30 IST

వెన్ను పోటు, గుండె పోటు జగన్ కుంటుంబానికి అలవాటని.. పవన్ కుటుంబానికి కాదని కిరణ్ రాయల్ అన్నారు.

Kiran Royal: నగరిలో రోజా శకం ముగిసింది..

తిరుపతి (Tirupathi): జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై విమర్శించిన పేర్ని నాని (Perni Nani) ఒక కాపలా కుక్కని జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Royal) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వెన్ను పోటు, గుండె పోటు జగన్ కుంటుంబానికి అలవాటని.. పవన్ కుటుంబానికి కాదని అన్నారు. పేర్ని నాని అవాకులు చెవాకులు పేలితే కుక్కును కొట్టినట్టు కొడతామని హెచ్చరించారు. ‘‘త్రిపుల్ యాక్సెల్ రోజా (Raja) అవ్వా.. మేము సింగల్‌గా రావలో.. మూకుమ్మడిగా రావాలో నువ్వు చేప్పాల్సిన అవసరం లేదు.. రోజా సీటే గల్లంతు, ఇక మా గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది.. నగరి నియోజవర్గంలో పార్టీ సమీక్ష పెట్టమంటుంటే ఎందుకు రోజా వెనకడుగు వేస్తున్నారు.. నగరిలో రోజా శకం ముగిసింది’’ అంటూ వ్యాఖ్యానించారు.


సీఎం జగన్ (CM Jagan) సతీమణి భారతీ రెడ్డి (Bharathi Reddy) తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎందుకు రారని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. సీఎం దంపతులు తిరుమలకు వచ్చి.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చూడాలని ప్రజల కోరికని అన్నారు. స్వామివారి దర్శనానికి భారతీ రెడ్డి రానంటున్నారా? లేక జగన్ రావద్దంటున్నారా?... ముఖ్యమంత్రి, పేర్ని నాని, రోజా సమాధానం చెప్పాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-09-20T21:51:18+05:30 IST