కరోనా ఎఫెక్ట్.. రేపటి నుంచి ఒక్కపూటే కిరాణా దుకాణాలు

ABN , First Publish Date - 2020-07-06T21:27:23+05:30 IST

కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరాలో మంగళవారం నుంచి కిరాణాదుకాణాల వేళలను కుదిస్తూ కిరాణా జాగీర్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఆదివారం వైరాలోని వాసవీ కల్యాణమండపంలో

కరోనా ఎఫెక్ట్.. రేపటి నుంచి ఒక్కపూటే కిరాణా దుకాణాలు

కిరాణదుకాణ యజమానుల సమావేశం


వైరా (ఖమ్మం): కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరాలో మంగళవారం నుంచి కిరాణాదుకాణాల వేళలను కుదిస్తూ కిరాణా జాగీర్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఆదివారం వైరాలోని వాసవీ కల్యాణమండపంలో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కిరాణా వ్యాపారులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే కిరాణా దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు వైరా అలాగే మండలంలోని అన్నిగ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.


వర్తకసంఘం అధ్యక్ష, కార్యదర్శులు వనమా విశ్వేశ్వరరావు, దారా కృష్ణారావు, కోశాధికారి కేసా రామారావు, కార్యవర్గ సభ్యులు వనమా చిన్ని, కొప్పురావూరి సత్యనారాయణ, గుర్రం శ్రీను, సంకా శ్రీను, తెల్లాకుల శ్రీను, కట్ల సంతోష్‌, అనుమోలు నాగు, వేముల కిషోర్‌, గజ్జల భాస్కర్‌రావు, పెరుమాళ్ల కిషోర్‌, వజినేపల్లి శ్రీను, దోసపాటి రవి, దారా కృష్ణ, కొదుమూరి మోహన్‌, రాయపూడి శ్రీను, నారాయణరావు, గజ్జల నర్సింహారావు, ప్రవీణ్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-07-06T21:27:23+05:30 IST