తిమ్మాపూర్లో కిషన్రెడ్డి సోదరుడి అంత్యక్రియలు
ABN , First Publish Date - 2021-04-23T05:08:31+05:30 IST
తిమ్మాపూర్లో కిషన్రెడ్డి సోదరుడి అంత్యక్రియలు
- కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి
కందుకూరు : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్రెడ్డి సోదరుడు(అన్న) యాదగిరిరెడ్డి అంత్యక్రియలు వారి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో గురువారం నిర్వహించారు. కాగా బుధవారం రాత్రి యాదగిరెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా, విషయం తెలుసుకున్న కిషన్రెడ్డి గురువారం ఉదయం 9:15నిమిషాలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తిమ్మాపురం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి శ్మశానవాటిక వద్దకు వచ్చారు. కిషన్రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్ సాధ మల్లారెడ్డి, బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు, ఎంపీపీ మంద జ్యోతి, మాజీ ఎంపీపీ వట్నాల శోభాఈశ్వర్గౌడ్, సర్పంచ్లు గంగాపురం గోపాల్రెడ్డి, జె. పరంజ్యోతి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.