చంద్రబాబును కొనియాడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-07-13T02:30:58+05:30 IST

ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము మద్దతిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబును కొనియాడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్: ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము మద్దతిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా 42 పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దత్తు ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. అబ్దుల్‌కలామ్‌ను రాష్ట్రపతిగా ఎన్నుకోవడంలో చంద్రబాబుది కీలక పాత్ర ఉందని గుర్తుచేశారు. తెలుగురాష్ట్రాల్లో సామాజిక బాధ్యత గల వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబుకు ఎన్డీఏ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-07-13T02:30:58+05:30 IST