బీజేపీ కార్పొరేటర్లకు కిషన్‌రెడ్డి క్లాస్

ABN , First Publish Date - 2022-04-23T23:05:09+05:30 IST

బీజేపీ కార్పొరేటర్లకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్లాస్ పీకారు. బీజేపీ ఆఫీస్‌లో బీజేపీ కార్పొరేటర్లతో కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు.

బీజేపీ కార్పొరేటర్లకు కిషన్‌రెడ్డి క్లాస్

హైదరాబాద్‌: బీజేపీ కార్పొరేటర్లకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్లాస్ పీకారు. బీజేపీ ఆఫీస్‌లో బీజేపీ కార్పొరేటర్లతో కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. కొత్త భవన నిర్మాణాల జోలికి వెళ్లోద్దని, ఈ విషయంపై తనకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. సోషల్‌ మీడియాలో కార్పొరేటర్లు యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. స్థానిక సమస్యలపై కార్పొరేటర్లు పోరాటం చేయాలని ఆదేశించారు. కార్పొరేటర్లు కష్టపడి పనిచేయాలన్నారు. హైదరాబాద్‌కు కేంద్రం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి సూచించారు. 

Updated Date - 2022-04-23T23:05:09+05:30 IST