బీజేపీ అంటే భయపడుతున్నారు: కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2022-04-28T22:14:32+05:30 IST
బీజేపీ అంటే భయపడుతున్నారు: కిషన్రెడ్డి
ఢిల్లీ: టిఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం బీజేపీ అంటే భయపడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబీకుల మాటలు, తీర్మానాలు అబూత కల్పనలే అని విమర్శించారు. దేశాన్ని ఉద్ధరించేది టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబమే అని మాట్లాడుతున్నారని, తెలంగాణలో 8 ఏళ్లుగా టీఆర్ఎస్ ఏం ఉద్ధరించిందో చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, గుణాత్మక మార్పు అని కేసీఆర్ మాట్లాడారని చెప్పారు. గుణాత్మకమైన పరిపాలన అంటే..కుటుంబ పాలనా? అని ప్రశ్నించారు. పుల్వామా సర్జికల్ స్ట్రైక్కి ఆధారాలు కోరిన వ్యక్తి దేశ సమగ్రత గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.