Kishan Reddy: కృష్టంరాజు మరణం బీజేపీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు..
ABN , First Publish Date - 2022-09-11T20:33:08+05:30 IST
కృష్టంరాజు అంత్యక్రియల ఏర్పాట్లుపై సీఎస్ సోమేష్ కుమార్తో మాట్లాడినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ (Hyderabad): తెలుగు సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్టంరాజు (Krishnam raju) అంత్యక్రియల ఏర్పాట్లుపై సీఎస్ సోమేష్ కుమార్తో మాట్లాడినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. జుబ్లీహిల్స్లోని కృష్టంరాజు నివాసంలో ఆయన పార్ధివదేహంపై పుష్పగుచ్చములుంచి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కృష్టంరాజు మరణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ప్రభాస్ (Prabhas)తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అభిమానుల సందర్శనార్ధం కృష్టంరాజు భౌతికకాయాన్ని ఉంచేందుకు ఏదైనా గ్రౌండ్లో ఏర్పాటు చేయాల్సిందిగా సీఎస్ను కోరానన్నారు. కృష్టంరాజు మరణం బీజేపీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని, తనను తమ్ముడిగా ప్రేమించేవారని కిషన్ రెడ్డి చెప్పారు.