విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-02-28T18:58:03+05:30 IST

ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..భారతీయ విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులను తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు వెళ్తున్నారని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌తో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. 

Updated Date - 2022-02-28T18:58:03+05:30 IST