కేసీఆర్కు కిషన్రెడ్డి లేఖ
ABN , First Publish Date - 2021-12-24T21:36:29+05:30 IST
సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణలో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కేంద్రమంత్రి లేఖలో కోరారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణలో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కేంద్రమంత్రి లేఖలో కోరారు. కేంద్ర పథకం ఎస్పీఓసీఎస్ కింద సైన్స్ సిటీ అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. సైన్స్ సిటీ ఏర్పాటుతో హైదరాబాద్ వైజ్ఞానిక హబ్గా మారుతోందని చెప్పారు. దీంతో హైదరాబాద్ మరో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుందన్నారు. సైన్స్ కల్చర్ను ప్రోత్సహించే పథకం కింద వెంటనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని 👆🏻లేఖలో కిషన్రెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు.