రామప్పకు విదేశీయులు వచ్చేలా...: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-21T21:51:02+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాచీన పురాతన కట్టడాలు ఉన్నప్పటికి, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం గర్వించదగ్గ విషయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

రామప్పకు విదేశీయులు వచ్చేలా...: కిషన్‌రెడ్డి

ములుగు: తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాచీన పురాతన కట్టడాలు ఉన్నప్పటికి, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం గర్వించదగ్గ విషయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గుర్తింపు రాకుండా కొందరు వ్యతిరేకించినా ప్రధాన మంత్రి సహకారంతో అద్బుత కట్టడమని ఒప్పించి గుర్తింపు తీసుకొచ్చామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మౌళిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చామని చెప్పారు. చాలాచోట్ల పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయన్నారు. మౌళిక వసతుల కోసం కేంద్రం కృషి చేస్తున్నామని తెలిపారు. వరంగల్  వేయిస్థంభాల గుడి, వరంగల్ పోర్ట్ ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అలంపూర్ జోగులాంబ, గోల్కొండ ఫోర్ట్ ను పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేస్తామన్నారు. రామప్పకు విదేశీయులు వచ్చేలా మామూనూరు ఎయిర్ పోర్ట్ త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నామని చెప్పారు. 

Updated Date - 2021-10-21T21:51:02+05:30 IST