టీఆర్ఎస్ నేతలపై కిషన్రెడ్డి ఆగ్రహం
ABN , First Publish Date - 2022-04-24T01:12:22+05:30 IST
టీఆర్ఎస్ నేతలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తమిళసై పట్ల తెలంగాణ ప్రభుత్వం దిగజారి
హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తమిళసై పట్ల తెలంగాణ ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. గవర్నర్పై మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ సవాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కొందరు పోలీసులతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కుమ్మక్కై.. ల్యాండ్, శాండ్, లిక్కర్, మైన్స్ మాఫియా నడిపిస్తున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు.