నాడు ముద్దులు - నేడు గుద్దులు
ABN , First Publish Date - 2022-08-18T06:05:00+05:30 IST
నాడు ఓట్ల కోసం ముద్దులు పెట్టిన జగన్, అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులతో ప్రజ లను పిడిగుద్దులు గుద్దుతున్నాడని విజయవాడ పార్ల మెంట్ ఉపాధ్యక్షుడు కె.విజయబాబు అన్నారు.
అన్నేరావుపేటలో టీడీపీ నేతలు
రెడ్డిగూడెం : నాడు ఓట్ల కోసం ముద్దులు పెట్టిన జగన్, అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులతో ప్రజ లను పిడిగుద్దులు గుద్దుతున్నాడని విజయవాడ పార్ల మెంట్ ఉపాధ్యక్షుడు కె.విజయబాబు అన్నారు. అన్నేరావుపేటలో 17వ బూత్లో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షల మేరా రుణభారాన్ని జగన్ మోపారని ఆరోపించారు. పార్టీ మండల అధ్యక్షుడు ముప్పిడి నాగేశ్వరరెడ్డి, పైడిమర్ల కిరణ్కుమార్ రెడ్డి, బాణావతు ప్రశాంతి, రమేష్, బల్లి డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.