ఇలా చేసి చూడండి!
ABN , First Publish Date - 2021-02-24T06:35:11+05:30 IST
చక్కెర కలిపిన నీటిలో బంగారు వస్తువులను అరగంట నానబెట్టాలి. ఆతర్వాత సబ్బునీటితో కడిగేస్తే మెరుపులు చిందిస్తాయి. బంగాళాదుంపలు ఉడికించిన నీటితో వెండి వస్తువులను తోమితే వాటిపై మరకలు పోతాయి...
- చక్కెర కలిపిన నీటిలో బంగారు వస్తువులను అరగంట నానబెట్టాలి. ఆతర్వాత సబ్బునీటితో కడిగేస్తే మెరుపులు చిందిస్తాయి.
- బంగాళాదుంపలు ఉడికించిన నీటితో వెండి వస్తువులను తోమితే వాటిపై మరకలు పోతాయి.
- పింగాణీ పాత్రలను ఉప్పు, నిమ్మరసం వేసి తయారుచేసిన మిశ్రమంతో తోమితే మల్లెపూవులా మెరుస్తాయి.
- కొద్దిగా వెనిగర్లో బియ్యప్పిండి వేసి దాంతో ఇత్తడి సామాన్లను తోమితే తళ తళలాడతాయి.
- బాగా జిడ్డు పట్టిన పాత్రలను వెనిగర్తో తోమితే జిడ్డు పూర్తిగా పోతుంది.
- బాగా ఖరీదైన తెల్లని లెదర్ బ్యాగు మీద ఇంకు చుక్కలు పడితే ఎంతో బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ మరకమీద కొద్దిగా టూత్ పేస్టును రాసి పావుగంట అలాగే ఉంచాలి. ఆ తర్వాత బ్రష్తో ఆ ప్రదేశంలో బాగా రుద్దితే బ్యాగు మీది ఇంకు మరక పోతుంది.