రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
ABN , First Publish Date - 2021-11-20T01:23:51+05:30 IST
ఇండియాతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది.
రాంచీ: ఇండియాతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. మార్టిన్ గప్టిల్ (31) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్ చాప్మన్ 17 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి అక్సర్ బౌలింగులో రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం పది ఓవర్లు ముగిశాయి. కివీస్ రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. మిచెల్ (29), గ్లెన్ ఫిలిప్స్ క్రీజులో ఉన్నారు.