నిలిచిన కాకినాడ కమిషనర్ బదిలీ
ABN , First Publish Date - 2021-07-27T06:42:44+05:30 IST
కార్పొరేషన్(కాకినాడ), జూలై 26: కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దిన్కర్ బదిలీ నిలిచిపోయింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దిన్కర్ కాకినాడ కమిషనర్ పోస్టులోనే విధులు నిర్వహించనున్నారని ప్రభుత్వం తెలిపింది. నాలుగు రోజు
కార్పొరేషన్(కాకినాడ), జూలై 26: కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దిన్కర్ బదిలీ నిలిచిపోయింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దిన్కర్ కాకినాడ కమిషనర్ పోస్టులోనే విధులు నిర్వహించనున్నారని ప్రభుత్వం తెలిపింది. నాలుగు రోజుల కిందట జరిగిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఆయనను చిత్తూరు జిల్లా జేసీగా బదిలీ చేశారు. వ్యక్తిగత పరిస్థితుల రీత్యా కొన్నాళ్లపాటు కాకినాడ కమిషనర్గానే కొనసాగుతానని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా జిల్లాకు చెందిన కీలక నేతలు కూడా కమిషనర్కు సహకరించారు. దీంతో ప్రభుత్వం తిరిగి మళ్లీ కొన్నాళ్లపాటు కమిషనర్గా కొనసాగేలా నియమిస్తూ జీవో నెం 1230 ఉత్తర్వులు విడుదల చేసింది.