ఇళ్ల స్థలాల పనులు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-12-02T05:30:00+05:30 IST
సర్పవరం జంక్షన్, డిసెంబరు 2: ఈనెల 25న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సత్వరమే ఇందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ ఆదేశించారు. బుధవారం రూరల్ మండలం తిమ్మాపురంలో సర్వే నెంబర్ 288/1
కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ
సర్పవరం జంక్షన్, డిసెంబరు 2: ఈనెల 25న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సత్వరమే ఇందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ ఆదేశించారు. బుధవారం రూరల్ మండలం తిమ్మాపురంలో సర్వే నెంబర్ 288/1లో లేఅవుట్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం చేపడుతున్న పనులను ఆయన తహశీల్దార్ వేముల మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో సుమారు 2,054 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేలా ప్లాట్లను విభజించి, సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశామన్నారు. మరో 6 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్ చేస్తున్నామని, సత్వరంగా పనులు పూర్తి చేసి స్థలం మెరక పనులు చేపట్టి, రాళ్లు పాతించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ ఆచార్యులు, వీఆర్వో దురాప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.