ఇళ్ల స్థలాల పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-12-02T05:30:00+05:30 IST

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 2: ఈనెల 25న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సత్వరమే ఇందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ ఆదేశించారు. బుధవారం రూరల్‌ మండలం తిమ్మాపురంలో సర్వే నెంబర్‌ 288/1

ఇళ్ల స్థలాల పనులు వేగవంతం చేయాలి
తిమ్మాపురంలో ఇళ్ల స్థలాలను పరిశీలిస్తున్న ఆర్డీవో చిన్నికృష్ణ

కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ 

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 2: ఈనెల 25న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సత్వరమే ఇందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ ఆదేశించారు. బుధవారం రూరల్‌ మండలం తిమ్మాపురంలో సర్వే నెంబర్‌ 288/1లో లేఅవుట్‌లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం చేపడుతున్న పనులను ఆయన తహశీల్దార్‌ వేముల మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామంలో సుమారు 2,054 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేలా ప్లాట్లను విభజించి, సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశామన్నారు. మరో 6 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్‌ చేస్తున్నామని, సత్వరంగా పనులు పూర్తి చేసి స్థలం మెరక పనులు చేపట్టి, రాళ్లు పాతించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్‌ ఆచార్యులు, వీఆర్వో దురాప్రసాద్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T05:30:00+05:30 IST