ఇంకా కోలుకోని కేఎల్ రాహుల్.. ఆ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉంటాడో, లేదో డౌటే..

ABN , First Publish Date - 2022-06-16T03:15:56+05:30 IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా సెలక్ట్‌ అయిన కేఎల్‌ రాహుల్.. గాయం కారణంగా ఆ సిరీస్‌ నుంచే తప్పుకున్నాడు. దాంతో పంత్ కెప్టెన్సీ..

ఇంకా కోలుకోని కేఎల్ రాహుల్.. ఆ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉంటాడో, లేదో డౌటే..

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా సెలక్ట్‌ అయిన కేఎల్‌ రాహుల్.. గాయం కారణంగా ఆ సిరీస్‌ నుంచే తప్పుకున్నాడు. దాంతో పంత్ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్.. జాతీయ క్రికెట్ అకాడమీలో గడుపుతున్నాడు. అయితే రాహుల్‌కు అయిన గాయం చిన్నదే అని.. త్వరగానే కోలుకుంటారని అభిమానులంతా అనుకున్నారు. కానీ.. తను గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది.



గతేడాది కోవిడ్‌ ఉధృతి కారణంగా భారత్-ఇంగ్లండ్‌ మధ్య చివరి టెస్టు మ్యాచ్‌ ఆగిపోయింది. ఆ మ్యాచ్‌ను వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్ ఎన్సీఏ లో రిహాబిటేషన్ సెంటర్లో గడుపుతున్నాడు. గాయం నుంచి కోలుకోనందున జులై మొదటి వారంలో కూడా టెస్టు మ్యాచ్‌కు కూడా దూరమయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ కోసం జూన్‌ 16న భారత జట్టులోని మొదటి బ్యాచ్‌ ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. రాహుల్ ద్రావిడ్, పంత్, శ్రేయస్ అయ్యర్‌తో పాటు మరికొంతమంది సౌతాఫ్రికాతో మ్యాచులు ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. టెస్టు మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. ఇంగ్లాండ్‌తో మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. అయితే టెస్టు మ్యాచ్‌కు దూరం కానున్న కేఎల్‌ రాహుల్.. టీ 20లు, వన్డేలకు అయినా అందుబాటులో ఉంటాడా.. ఆ సిరీస్‌లకు కూడా దూరమవుతాడా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-06-16T03:15:56+05:30 IST