కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-09-28T11:21:16+05:30 IST

మండలంలోని గుళ్లదుర్తి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేనయ్య అనే కౌలు రైతు ఆదివారం రాత్రి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. హుస్సేనయ్య కుందూ వెంట ఉన్న సుమారు 16 ఎకరాలను కౌలుకు తీసుకొని 12 ఎకరాలు వరి పంట, 4 ఎకరాలు మిరప పంటను సాగు చేశాడు.

కౌలు రైతు ఆత్మహత్యాయత్నం


కోవెలకుంట్ల, సెప్టెంబరు 27: మండలంలోని గుళ్లదుర్తి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేనయ్య అనే కౌలు రైతు ఆదివారం రాత్రి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. హుస్సేనయ్య కుందూ వెంట ఉన్న సుమారు 16 ఎకరాలను కౌలుకు తీసుకొని 12 ఎకరాలు వరి పంట, 4 ఎకరాలు మిరప పంటను సాగు చేశాడు. ఈ పంటలు సాగు చేయడానికి రూ.6లక్షల దాకా అప్పులు తెచ్చి పంటలు సాగు చేశాడు.


అయితే శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆదివారం ఉదయం వరద నీరు ఉధృతంగా రావడంతో తాను సాగు చేసిన 12 ఎకరాల వరి, నాలుగు ఎకరాల మిరప పూర్తిగా మనిగి దెబ్బతింది. దీంతో హుస్సేనయ్య మనస్తాపానికి గురై క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బంధువులు హుస్సేనయ్యను కోవెలకుంట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు.

Updated Date - 2020-09-28T11:21:16+05:30 IST