‘ర్యాబీస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి’
ABN , First Publish Date - 2020-09-29T10:56:59+05:30 IST
కుక్కల నుంచి వచ్చే ర్యాబీస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ నరసింహారావు సూచించారు. ప్రపంచ ర్యాబీస్ వ్యాధి నివారణ దినాన్ని పురష్కరించుకొని కుక్కలను పెంచుకునే యజమానులకు పట్టణంలోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఆళ్లగడ్డ, సెప్టెంబరు 28: కుక్కల నుంచి వచ్చే ర్యాబీస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ నరసింహారావు సూచించారు. ప్రపంచ ర్యాబీస్ వ్యాధి నివారణ దినాన్ని పురష్కరించుకొని కుక్కలను పెంచుకునే యజమానులకు పట్టణంలోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కుక్కల యజమానులు తమ కుక్కలు కరచిన ర్యాబీస్ వ్యాధి సోకకుండా ఉండేందుకు టీకాలు వేయించాలన్నారు. ఏడీఏ వరప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.