రైతులకు బేడీలు రాక్షసత్వం

ABN , First Publish Date - 2020-10-29T09:32:02+05:30 IST

అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.కోట్ల విలువచేసే భూములను ఉచితంగా ఇచ్చిన రైతులపై వైసీపీ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని,

రైతులకు బేడీలు రాక్షసత్వం

సీఎం జగన్‌ తీరుపై చంద్రబాబు ఆగ్రహం

జిల్లా నాయకులతో పార్టీ వ్యవహారాలపై చర్చ 


కర్నూలు (అగ్రికల్చర్‌), అక్టోబరు 28: అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.కోట్ల విలువచేసే భూములను ఉచితంగా ఇచ్చిన రైతులపై వైసీపీ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని, పండుగ పూట అన్నదాతల చేతులకు బేడీలు వేసి కన్నీరు పెట్టించడం దారుణమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జూమ్‌ యాప్‌ ద్వారా పార్టీ జిల్లా నాయకులతో బుధవారం ఆయన పార్టీ వ్యవహారాలను చర్చించారు. కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల ఇన్‌చార్జులు, పార్టీ నాయకులతో చంద్రబాబు వివిధ అంశాల గురించి మాట్లాడారు. అమరావతి రైతులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాక్షస పాలనతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని, దీంతో తెలుగుదేశం పార్టీకి ప్రజలు జేజేలు పలుకుతున్నారని చంద్రబాబు అన్నారు. పార్టీకి పూర్వవైభవం వస్తుందని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించారు. సమావేశంలో పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి, టీజీ భరత్‌, కేఈ శ్యాంబాబు, కోట్ల సుజాతమ్మ, తిక్కారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని నాయకులు చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

Updated Date - 2020-10-29T09:32:02+05:30 IST