టీఆర్ఎస్ ప్రభుత్వలో బడ్జెట్‌కి విలువ లేదు: కోదండరాం

ABN , First Publish Date - 2022-03-08T17:59:25+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌కి విలువ లేకుండా పోయిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వలో బడ్జెట్‌కి విలువ లేదు: కోదండరాం

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌కి విలువ లేకుండా పోయిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వెనక్కి తీసుకుని సభలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బడ్జెట్‌కు, ఖర్చుకు20శాతం తారతమ్యం ఉంటోందని విమర్శించారు.  సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో అప్పులు పెరుగుతున్నాయి.. అంచనాలు తప్పుతున్నాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ ఆత్మహత్యలకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. నిరుద్యోగభృతి ఏమైంది? అని ప్రశ్నించారు. విద్యా,వైద్యం మౌలిక సదుపాయాలు కల్పన లేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య , ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోదండరాం డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-08T17:59:25+05:30 IST