పల్లెకోనలో ముగిసిన కోడి పందాలు

ABN , First Publish Date - 2021-01-17T05:00:23+05:30 IST

మండలంలోని పల్లెకోనలో నిర్వహిస్తున్న కోడి పందాలు సంక్రాంతి సంబరాలు శనివారం రాత్రితో ముగిశాయి.

పల్లెకోనలో ముగిసిన కోడి పందాలు
భట్టిప్రోలు మండలం పల్లెకోనలో పోటీలో తలపడుతున్న కోడి పుంజులు

యథేచ్ఛగా మద్యం విక్రయాలు

కన్నెత్తి కూడా చూడని అధికారులు

భట్టిప్రోలు, జనవరి 16 :  మండలంలోని పల్లెకోనలో నిర్వహిస్తున్న కోడి పందాలు సంక్రాంతి సంబరాలు శనివారం రాత్రితో ముగిశాయి.  నాలుగు రోజుల పాటు జరిగిన కోడి పందాలు  చివరి రోజు కావడంతో పక్క జిల్లాల నుంచి పందెం రాయుళ్ళు పల్లెకోనకు తరలివచ్చారు.  బరుల్లో రూ. వేలు, రూ. లక్షల్లో పందాలు జరుగగా బరుల బయట వందలు, వేల రూపాయిలు పందాలు జరిగాయి. బహిరంగంగా స్టాల్స్‌ ఏర్పాటు చేసి యథేచ్ఛగా అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపినా సంబంధిత అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. విశాలమైన ప్రాంగణంలో పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో సమీప మండలాల నుంచి పందెంరాయుళ్ళు, ప్రజలు పల్లెకోనకు వచ్చారు. కోడి పందాలను తిలకించేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తరలివచ్చారు. గుండాట, పేకాట, పెద్దబజార్‌, చిన్నబజార్‌ వంటి జూద క్రీడల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. 


Updated Date - 2021-01-17T05:00:23+05:30 IST