అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ అరుదైన ఘనత

ABN , First Publish Date - 2020-11-29T22:45:33+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు

అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ అరుదైన ఘనత

సిడ్నీ: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 22 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. అలాగే, ఆస్ట్రేలియాపై వన్డేల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కోహ్లీ 40 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్, రోహిత్‌శర్మ ఉన్నారు.  

Updated Date - 2020-11-29T22:45:33+05:30 IST