IND vs ENG ODI: ఇంగ్లండ్‌తో తొలి వన్డే టైంలో టీమిండియాకు ఎదురుదెబ్బ.. కోహ్లీ ఆడటం డౌటే..!

ABN , First Publish Date - 2022-07-12T03:46:56+05:30 IST

ఇంగ్లండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో ఓడినప్పటికీ సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియాకు ఇంగ్లండ్‌తో తొలి వన్డే సమయానికి ఎదురుదెబ్బ తగిలే..

IND vs ENG ODI: ఇంగ్లండ్‌తో తొలి వన్డే టైంలో టీమిండియాకు ఎదురుదెబ్బ.. కోహ్లీ ఆడటం డౌటే..!

ఇంగ్లండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో ఓడినప్పటికీ సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియాకు ఇంగ్లండ్‌తో తొలి వన్డే సమయానికి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్షనల్ ప్రాక్టీస్‌కు విరాట్ కోహ్లీ రాకపోవడంతో ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో కోహ్లీ ఆడకపోవచ్చనే సందేహం వ్యక్తమవుతోంది. కెన్నింగ్‌టన్ ఓవల్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. గజ్జల్లో గాయం అయిన కారణంగా కోహ్లీ తొలి వన్డేకు దూరంగా ఉండే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం.



ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా జరిగే ఐదు టీ20ల సిరీస్‌లో భారత స్టార్‌ ఆటగాళ్లంతా పాల్గొనే అవకాశం ఉంది. అయితే విరాట్‌ కోహ్లీకి మాత్రం ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కోహ్లీకి ఇది ఉద్వాసన కాదని, అతడి విజ్ఞప్తి మేరకే విండీస్‌ టూర్‌ నుంచి మినహాయించనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. మరోవైపు ఏడు నెలలుగా అంతర్జాతీయ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 10న ఇంగ్లండ్‌తో మూడోటీ20 ముగిశాక విండీస్‌తో పొట్టి సిరీస్‌ కోసం టీమిండియా జట్టును ఎంపిక చేయనున్నారు.

Updated Date - 2022-07-12T03:46:56+05:30 IST